PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న గోరుముద్ద.. విద్యార్థులకు రాగి జావా పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్లలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మోడల్ స్కూల్ తో పాటు ఆయా ప్రభుత్వ పాఠశాలలో మండల ఎంపీపీ నసురుద్దీన్ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాగి జావాను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని ఎర్రబాడు గ్రామంలో పాఠశాల యందు గ్రామ సర్పంచ్ అరుంధతి భర్త సింగిల్ విండో ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథరెడ్డి, గంజహళ్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చిలక రాముడు, వైసీపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి లు విద్యార్థులకు రాగి జావా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు మాజీ కన్వీనర్ గోవిందు, కే మాబు వలి, ఎంపీటీసీ పద్మనాభం, బగిలి ఉస్మాన్, కాంట్రాక్టర్ రంగస్వామి, ఉరుకుందు, మునిస్వామి, నాగేష్ ,గోపాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author