PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌లెక్టరేట్ ముట్టడిలో జేడీ ల‌క్ష్మినారాయ‌ణ

1 min read

విశాఖ‌: విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వ్యతిరేకిస్తు కార్మికులు క‌లెక్టరేట్ ముట్టడించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కంటూ నిన‌దించారు. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఆధ్వర్యంలో సరస్వతీ న‌గ‌ర్ పార్కు వ‌ద్ద నుంచి క‌లెక్టరేట్ వ‌ర‌కు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కారులు ఆందోళ‌న‌కు దిగారు. ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. పోటెత్తిన నిర‌స‌న‌కారుల‌తో క‌లెక్టరేట్ వెళ్లే దారుల‌న్నీ మూసుకుపోయాయి. నిర‌స‌న‌కారుల‌ను క‌లెక్టరేట్ లోప‌లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు చాలా క‌ష్టప‌డ్డారు. ఉక్కు ప‌రిశ్రమ ఉద్యోగుల క‌లెక్టరేట్ ముట్టడికి అన్ని పార్టీల నాయ‌కులు మ‌ద్దతు తెలిపారు.

About Author