PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూటూరు రవి నియామకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి అనుబంధ విభాగమైన తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూటూరు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ ఆశీస్సులతో తనకు ఈ పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు ఆయన. కర్నూల్లో టిడిపిని బలోపేతం చేసేందుకు కష్టపడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిజి భరత్ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు టిజి భరత్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, తెలుగుయువత నేత యూనుస్ బాషా, చంద్రశేఖర్, దిలీప్, శేఖర్ పాల్గొన్నారు.

About Author