PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రిక

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం లో యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారికి ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్ర శేఖర్ రెడ్డి ,పాలక మండలి సభ్యులు ,అర్చకులు అందచేశారు.ముందుగా పూల మాలలు వేసి శాలువ కప్పి సత్కరించి ఆహ్వాన పత్రికను అందచేశారు. యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం లో ఈ నెల 26 వ తేదీ నుంచి నవంబర్ 23 వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవం ఎంతో వైభవంగా జరుగునున్నాయి.ఈ నెల 31 వ తేదీన మొదటి సోమవారం అని,నవంబర్ 7 వ తేదీన కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడును అని చెప్పారు.ఈ కార్యక్రమం లో మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి,కోడూరు రామచంద్ర రెడ్డి, యామ మనోహర్ రెడ్డి,జోలపురం తీరుపాల్,పుల్లారెడ్డి, చెర్లో కొత్తూరు మాధవ రెడ్డి,ఎర్రగుడి రామ సుబ్బారెడ్డి,బింగిమళ్ళ సత్యనారాయణ,బసప్ప ,ప్రధాన అర్చకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author