PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. టీడీపీ నేత‌ల‌కు హైకోర్టులో ఊర‌ట‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా బేతంచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. బేతంచర్లలోని సంజీవయ్యనగర్‌లో నీరు రావడం లేదని కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసేందుకు నేతలు వెళ్లారు. ఈ సంద‌ర్బంగా తనను కులం పేరుతో దూషించారని టీడీపీ నేతలపై కమిషనర్‌ ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఫిర్యాదుపై టీడీపీ నేతలు ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో సవాల్‌ చేశారు. టీడీపీ నేతల తరపున న్యాయవాది కృష్ణారెడ్డి వాదించారు. ఈ క్రమంలో కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.

                                                

About Author