PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందుపురం ఎంపీ గోరంట్లను కలిసిన కురువ సంఘం నేతలు

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: అనంతపురం జిల్లా హిందుపురం ఏంపీ గోరంట్ల మాధవ్​ను కర్నూలు జిల్లా కురువ సంఘం నేతలు ఆదివారం కలిశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్దహరివాణం దేవేంద్రప్ప, ఎంకే రంగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న, కల్లె లక్ష్మన్న తదితరులు కలిసి ఈనెల 10వ తేదిన ఆదోనిలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురువ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పోరేట్ లను సన్నానించ తలపెట్టినట్లు తెలిపారు. సదరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఎంపీ గోరంట్ల మాధవ్​ను కోరారు. కార్యక్రమంలో రఘురాముడు, పరమేష్, ముకుంద, ఆదోని అయ్యాలప్ప, భానుప్రకాష్ ,హొళగుంద అయ్యాలప్ప, బోడబండ నరసింహులు పాల్గొన్నారు.

About Author