రాజధానిలో మరో ఆరుసంస్థలకు భూకేటాయింపులు
1 min read
గతంలో భూకేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు.
రెండు సంస్థలకు కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం.
ఇప్పటివరకూ మొత్తం 74 సంస్థలకు భూకేటాయింపులు పూర్తి.
గత ప్రభుత్వ నిర్వాకంతో కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయి.
మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో మంత్రి నారాయణ
అమరావతి, న్యూస్ నేడు: గత ప్రభుత్వ నిర్వాకం,మూడు రాజధానుల దెబ్బకు అమరావతి అంటే కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయన్నారు మంత్రి నారాయణ.గతంలో భూకేటాయింపులు చేసిన సంస్థలు ఇప్పుడు సరిగా స్పందించడం లేదన్నారు…తాజాగా అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు…మొత్తం నాలుగు సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయగా,కొత్తగా ఆరు సంస్థలకు సబ్ కమిటీ కేటాయింపులు చేసింది..అయితే గతంలో కేటాయించిన రెండు సంస్థలకు భూముల కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది…సచివాలయంలో జరిగిన భూకేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు నారాయణ,టీజీ భరత్ హాజరయ్యారు…మంత్రులు పయ్యావుల కేశవ్,దుర్గేష్ లు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు.సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు.రాజధాని భూకేటాయింపుల సబ్ కమిటీ 18వ సమావేశం జరిగింది…మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది…వీటిలో 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు తిరిగి కేటాయింపుల్లో మార్పులు చేస్తూ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది….సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్…సీబీఐకు రెండు ఎకరాలు అలాగే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు,స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు,ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపులను కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు…ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపాం..అలాగే 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశాం. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బత్తి సంస్థకు చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈరోజు కొత్తగా మరో ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు మంత్రి చెప్పారు… ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు,ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు,ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB) కి 0.5 ఎకరాలు,బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు,బీజేపీ కార్యాలయానికి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం…2014-19 మధ్య కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు కేటాయించగా గత ప్రభుత్వ నిర్వాకం,మూడు ముక్కలాటతో పలు సంస్థలు భయపడి వెనక్కి వెళ్లిపోయాయి…ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపి తిరిగి కేటాయింపుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం…ఇప్పటివరకూ 64 సంస్థలకు 884 ఎకరాలు కేటాయించగా ఈరోజు మరో పది సంస్థలకు కేటాయింపులు పూర్తి చేసామన్నారు మంత్రి నారాయణ…భూకేటాయింపులు చేసిన సంస్థలు వీలైనంత త్వరగా నిర్మాణాలు ప్రారంభిస్తాయన్నారు…అమరావతిలో ఇప్పటికే పదివేలకు పైగా కార్మికులు పుల్లో నిమగ్నమయ్యారన్నారు…వర్షాలు తగ్గుముఖం పట్టేనాటికి మొత్తం 20వేల మంది కార్మికులతో పనులు శరవేగంగా కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.జారీ చేసిన వారుపురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి కార్యాలయం,సచివాలయం,అమరావతి.
