PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్​ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపుకై టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్ల మండలంతో పాటు పాటు మండలంలోని తిప్పనూరు, బోదేపాడు, లింగందిన్నె, గాజులదిన్నె,కూన్నూర్ గ్రామల నందు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని (1) ప్రధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా గోనెగండ్ల మండలం క్లస్టర్ ఇంచార్జి నజీర్ సాహెబ్, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, అడ్వకేట్ వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తూ ప్రతి ఓటర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశందేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author