PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం

1 min read

– టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి

– చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన

– రాత్రి 7 గంటలకు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ  వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చిన నేపధ్యంలో  శనివారం రాత్రి 7 గంటలకు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు  ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి ఐదు నిమిషాలు లైట్లు వెలిగించాలని  నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.  మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి.. అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం అని  పేర్కొన్నారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని నియోజకవర్గ  వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

About Author