PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాన ఎన్నికల్లో కురువల సత్తా చాటుదాం: మాన్వి దేవేంద్రప్ప

1 min read

పల్లెవెలుగు వెబ్​ :రాబోయే ప్రధాన ఎన్నికల్లో కురవల సత్తా చూపుదామని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ఉపాధ్యక్షులు కేటీ ఉరుకుందు పేర్కొన్నారు. బుధువారం ఎమ్మిగనూరులోని బీరలింగేశ్వర కమ్యూనిటీ హల్ లో మండల పతాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జనాభా ప్రతిపాదికన అధిక సంఖ్యలో కురువలు ఉన్నా ఆయా రాజకీయ పార్టీలు రాజకీయంగా అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. లేకపోతే స్వతంత్రులుగా పోటీ చేస్తామన్నారు. శ్రీశైలంలోని కురువల అన్నదాన సత్రం తెలంగాణ నాయకుల నుండి జిల్లాకు వచ్చేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు. రెండు నెలల్లో సత్రాన్ని జిల్లా కమిటీకి అప్పగించాలని లేని పక్షంలో సత్రం వద్దే టెంటు వేసుకుని నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

కురువ సోదరులు కురువ సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కర్నూలులో బీర లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి 1.5ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన కర్నూలు నగర గౌరవ అధ్యక్షులు పాల సుంకన్నను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కేసీ నాగన్న, కళ్ళే లక్ష్మన్న నగర కార్యదర్శి బి .రామకృష్ణ ,ఓ .పుల్లన్న ,వెంకటేశ్వర్లు ,, బాలరాజు ,బి .మల్లికార్జున ఎల్లయ్య ,జిల్లా యువజన సంఘం అధ్యక్షులు రఘురామ్, స్థానిక నాయకులు హంపయ్య, జీ ఎం ర్ వెంకటరాముడు మద్దిలేటి, వీరనాగప్ప, బడేసాబ్, పల్లె నాగేంద్రప్ప, డాక్టర్ సత్యన్న, ల్యాబ్ భీరప్ప, బోడబండ రవికుమార్, ఉరుకుందు, ఓబులేసు, గాజులదిన్నె హనుమంతు, పిల్లిగుండ్ల నాగన్న తదితరులు పాల్గొన్నారు.

About Author