PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్రుని ప్రాశస్త్యాన్ని నలుదిశలా వ్యాపింపచేద్దాం

1 min read

– భక్తుల వసతి సముదాయ ప్రాంగణానికి జరిగిన భూమి పూజలో
– ఎంపి మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలు.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: భద్రకాళీ సమేత ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎంపి మిథున్ రెడ్డి,వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలు పేర్కొన్నారు. గురువారంరాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయ ప్రాంగణంలో భక్తుల వసతి సముదాయ ప్రాంగణానికి జరిగిన భూమి పూజలో ఎంపి మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలు పాల్గొన్నారు.కన్నడ భక్తులు, ఇతర ప్రాంతాల భక్తుల విరాళాలుతో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాన్ని నిర్మింప చేస్తుండడం హర్షణీయమన్నారు.ఆలయ ప్రాశస్త్యాన్ని నలుదిశలా వ్యాపింపచేద్దామన్నారు.
స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు…
భద్రకాళీ సమేత వీరభద్రునికి ఎంపీ మిథున్ రెడ్డి,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి వారిచేత పూజా కార్యక్రమాలు నిర్వహింప చేసి తీర్థ ప్రసాదాలు అందచేసి దుస్సాలువలుతో సత్కరించారు.అన్నదాన కార్యక్రమంలో ఎంపీ,ఎంఎల్ఏ లు పాల్గొన్నారు.

About Author