NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ సమైక్యతను కాపాడుకుందాం..

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  దేశ ప్రజలందరూ మత సామరస్యాన్ని పాటించాలని, దేశ సమగ్రతను కాపాడుకుందామని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సమైక్యత ర్యాలీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, దేశంలో మతసామరస్యం లౌకికవాదం ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ దీని నుండి బయటపడడానికి ప్రజాస్వామ్యవాదులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి మతతత్వం నుండి ఉగ్రవాదం నుండి ఎదుర్కొనే పరిస్థితి దేశంలో ఉందన్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకధాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ మండల కార్యదర్శి నాగరాజు, కాంగ్రెస్ మండల నాయకులు మహమ్మద్ భాష సిపిఐ మండల కార్యదర్శి రాజ సాహెబ్ మైనార్టీ సంఘం నాయకులు కపిల్ ఇబ్రహీం, కెవిపిఎస్ నాయకులు రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు రవి, గిరిజన సంఘం నాయకులు భాస్కర్ నాయక్, దళిత సమాఖ్య నాయకులు సీను సర్పంచుల సంఘం నాయకులు కేశవరెడ్డి, ఫర్టిలైజర్స్ సంఘం నాయకులు గాంధీ రెడ్డి, సిపిఎం మండల నాయకులు దస్తగిరి, రంగారెడ్డి, గోపాల్, ప్రజానాట్యమండలి కాశన్న ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు రవిచంద్ర ఇతరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *