PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాణహాని ఉంది.. మాజీ మంత్రి వివేకా పీఏ ఫిర్యాదు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో తనపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిసి నాలుగు పేజీల లేఖ అందించాడు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డి అనే మరో వ్యక్తి పేరును లేఖలో పేర్కొన్నాడు. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను కోరాడు. ఎస్పీ అన్బురాజన్ సైతం వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు పై స్పందించారు. ఫిర్యాదు అందిందని స్పష్టం చేశారు. కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి వద్ద 30 ఏళ్లుగా పీఏగా పనిచేశారు. ఇప్పడు వివేకా కూతరు, అల్లుడి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

About Author