PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారం వారం కొత్త అప్పులు వెతుక్కుంటోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం పై బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ప్రత్యేక హోదా వ్యవస్థ ప్రస్తుతం లేదని, రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా.. ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో 13 వేల కోట్లు ఇస్తున్నామని ఎంపీ జీవీఎల్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే దానికి తగ్గ నిబంధనలు ప్రభుత్వం పాటించాలని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వారంవారం కొత్త అప్పులు వెతుక్కుంటోందని జీవీఎల్ విమర్శించారు.

                                      

About Author