వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చెయండి
1 min read
న్యూస్ నేడు ఆలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం 9 గంటలకుఆలూరు సాయిబాబా ఆలయం దగ్గర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.కావున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆలూరు నియోజకవర్గం లో ఉన్న ఆలూరు, హొళగుంద, చిప్పగిరి, ఆస్పరి, హాలహర్వి, దేవనకొండ, ఈ ఆరు మండల కన్వీనర్ లు, జడ్పిటిసి లు, కో కన్వీనర్ లు,ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, ఆలూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, మండల కమిటి సభ్యులు, సొసైటీ చైర్మన్ లు, మాజీ సొసైటీ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, వైయస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు.. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమనికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.