PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాన్స్ నాయ‌క్ సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండ

1 min read

పల్లెవెలుగు వెబ్​: త‌మిళ‌నాడు కున్నూరు వ‌ద్ద జ‌రిగిన ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన లాన్స్ నాయ‌క్ సాయితేజ కుటుంబానికి ప్రముఖ హీరో మంచు మోహ‌న్ బాబు కుటుంబం అండ‌గా నిల‌బ‌డింది.  లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా.. తమిళనాడు కూనూర్‌ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

About Author