PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ ను కలిసిన మండిపల్లి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గం యువ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి టిడిపిలో చేరే విషయంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాయచోటి మరియు కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి సుమారు గంట పాటు చర్చించడం జరిగింది. రానున్న కాలంలో యువకులు అందరం కలిసి చంద్రబాబు నాయుడుని సీఎం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని నారా లోకేష్ బాబు సూచించినట్లు తెలుస్తోంది.

About Author