NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెన్నుపోటు దినం భారీ నిరసన ర్యాలీ…

1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు_వైయస్సార్​సిపి ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_పిలుపుతో భారీగా వెన్నుపోటు దినం కార్యక్రమనికి వచ్చిన వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, మరియు యువకులువైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు కర్నూల్ జిల్లా ఆలూరు_ వైయస్సార్​సిపి ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయలపై ఆలూరులో వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ వారి కార్యాలయంకు వెన్నుపోటు దినం భారీ నిరసన ర్యాలీగా వెళ్లి గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  ఆలూరు_ వైయస్సార్​సిపి ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ మాట్లాడుతూ,గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు.. ప్రతి ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. మరోవైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌. ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాలంలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల అప్పు.మరోవైపు యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంతో, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైంది. ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకం.వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్రమంతా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు ఇలా వినతి పత్రాలు అందజేస్తున్నాం. కావున, మీరు దయ ఉంచి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా చూసి ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో  ఆరు మండల కన్వీనర్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, కో కన్వీనర్స్, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, తాలూకా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *