PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీగా పెంచారు.. 5,10 త‌గ్గించారు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : పెట్రోల్ ధ‌ర‌ల పై ఏపీ ప్రభుత్వ ప్రధాన స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. పెట్రోల్‌ ధరలపై బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వాస్తవాలపై ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పబ్లిక్‌ ప్రకటన ఇచ్చిందన్నారు . పెట్రోల్‌ ధరలను కేంద్రం పెంచి.. రాష్ట్రాన్ని తగ్గించమనడం ఏంటని ప్రశ్నించారు. పెట్రోల్‌పై కేంద్రం రూ. 3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. అందులో ఎక్సైజ్‌ డ్యూటీ కేవలం రూ. 47 వేల 500 కోట్లు అని.. ఆ మొత్తంలో అన్ని రాష్ట్రాలకు వచ్చింది రూ. 19,475 కోట్లు మాత్రమేనని తెలిపారు. మిగిలిన 3 లక్షల 15 వేల 525 కోట్లు నేరుగా కేంద్రం ఖజానాకే జమ అయ్యాయని తెలిపారు.

About Author