వైద్య సేవకు.. గుర్తింపు..
1 min read
డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్ ను వరించిన అత్యుత్తమ అవార్డు
- లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛాంపియన్ ఆఫ్ చైన్జ్ అవార్డుకు ఎంపిక
- రేపు కలకత్తాలో అవార్డు అందుకోనున్న వీసీ
కర్నూలు ( హాస్పిటల్ ), న్యూస్ నేడు :భారతదేశంలో అత్యుత్తమ ప్రజా, వైద్య సేవలు అందించిన వారిని ప్రోత్సహించే లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛాంపియన్ ఆఫ్ చైన్జ్ అవార్డుకు డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైన్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ ఎంపికయ్యారు. దేశంలో వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేసిన 13 మందిని ప్రముఖ లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఛాపియన్ ఆఫ్ చైన్జ్ అవార్డుకు ఎంపిక చేసింది. వీరికి ఆదివారం కలకత్తా లోని బెంగళూరు స్టేట్ రూమ్, ఐటీసీ రాయల్లో అవార్డు అందుకోనున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ గా, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గా, కార్డియాలజి విభాగం హెచ్ ఓడిగా విధులు నిర్వర్తించిన డా. చంద్ర శేఖర్.. . లక్షల మంది పేదల ప్రాణాలు కాపాడి… మెడికల్ విద్యార్థులకు స్ఫూర్తిగా.. ప్రొఫెసర్లకు ఆదర్శంగా నిలిచారు. వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛాంపియన్ ఆఫ్ చైన్జ్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ డా. చంద్ర శేఖర్ మరెన్నో మైలు రాళ్లు అధిగమించాలని ఈ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ, కార్డియాలజి డిపార్ట్ మెంట్ వైద్య సిబ్బంది ఆకాంక్షించారు.