NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య సేవకు.. గుర్తింపు..

1 min read

డా.ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్​ ను వరించిన అత్యుత్తమ అవార్డు

  • లయన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఛాంపియన్​ ఆఫ్​ చైన్జ్​ అవార్డుకు ఎంపిక
  • రేపు కలకత్తాలో అవార్డు అందుకోనున్న వీసీ

కర్నూలు ( హాస్పిటల్​ ), న్యూస్​ నేడు :భారతదేశంలో అత్యుత్తమ ప్రజా, వైద్య సేవలు అందించిన వారిని ప్రోత్సహించే లయన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఛాంపియన్​ ఆఫ్​ చైన్జ్​  అవార్డుకు డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైన్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ ఎంపికయ్యారు. దేశంలో వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేసిన 13 మందిని ప్రముఖ లయన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సంస్థ  ఛాపియన్​ ఆఫ్​ చైన్జ్​ అవార్డుకు ఎంపిక చేసింది. వీరికి ఆదివారం కలకత్తా లోని బెంగళూరు స్టేట్​ రూమ్​, ఐటీసీ రాయల్​లో అవార్డు అందుకోనున్నారు.  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్​ గా, మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ గా, కార్డియాలజి విభాగం హెచ్​ ఓడిగా విధులు నిర్వర్తించిన డా. చంద్ర శేఖర్​.. . లక్షల మంది పేదల ప్రాణాలు కాపాడి… మెడికల్​ విద్యార్థులకు స్ఫూర్తిగా.. ప్రొఫెసర్లకు ఆదర్శంగా నిలిచారు.  వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ లయన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఛాంపియన్​ ఆఫ్​ చైన్జ్​ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​  వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ డా. చంద్ర శేఖర్​ మరెన్నో మైలు రాళ్లు అధిగమించాలని ఈ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్​ డా. వెంకటేశ్వర్లు, మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ డా. చిట్టి నర్సమ్మ, కార్డియాలజి డిపార్ట్​ మెంట్​ వైద్య సిబ్బంది ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *