PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లీడ్ బ్యాంక్ ఆఫీస్లో బ్యాంకర్లతో సమావేశం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ ఆఫీస్ నందు జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా లీడ్ బ్యాంకు మేనేజర్ వై వెంకట్ నారాయణ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమము నవంబర్ ఒకటో తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో జిల్లాలోని అన్ని బ్యాంకులు మరియు బ్యాంకు శాఖలు అలాగే నాన్ బ్యాంకు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఇతర ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొనడం జరుగుతుంది ఈ సదస్సు లు జిల్లాలోని, అన్నివిలేజ్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లోనూ, బ్లాక్ లెవెల్ లోను, సిటీ లెవెల్ మరియు డిస్టిక్ లెవెల్ లో జరుగుతాయి.ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ , ఆన్లైన్ మార్కెటింగ్ లో జరిగే మోసాల, నకిలీ రుణ యాప్ ల మీద, ఆర్థిక భద్రత మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీం మీద మరియు సైబర్ క్రైమ్ మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.ముఖ్యంగా రైతులకు, ఎస్ హెచ్ జి మహిళలకు, స్కూల్ చిల్డ్రన్స్ కి సీనియర్ సిటిజన్స్ కి మరియు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు పొందిన వారికి ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author