నేషనల్ హైవే కాంట్రాక్టర్ పై..మంత్రి ఆగ్రహం
1 min read
ప్రజల సొమ్ము దుర్వినియోగం
నాణ్యతలేని రోడ్డుపై విజిలెన్స్ విచారణ
ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష రికవరీ చేస్తాం
నేషనల్ హైవే రోడ్డును పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నాణ్యతలేని నేషనల్ హైవే రోడ్డు పనులు చేయించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉ 11 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నేషనల్ హైవే 340 సీ నాగలూటి దగ్గర నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి మంత్రి నేషనల్ హైవే రోడ్డు కుంగిన వాటిని పరిశీలించారు.ఈ రోడ్డును నాణ్యత లేకుండా వేయడం పట్ల మంత్రి కాంట్రాక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ కాంట్రాక్టర్ గతంలో కూడా నాణ్యత లేని పనులు చేశారు. వీటి వెనుక ఎవరు ఉండే నడిపిస్తున్నారో మాకు తెలియదని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి రికవరీ చేయిస్తామని నాణ్యతలేని రోడ్లు వేస్తే అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్ అండ్ భీ శాఖకు గతంలోనే ఆదేశాలు ఇచ్చారని అన్నారు.ప్రజల సొమ్ముతో వేసిన ఈ రోడ్లు వృధా అవుతున్నాయని పొంగిన రోడ్ల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజే ఆదేశాలు జారీ చేస్తానని ఇలాంటి వారిపై ప్రత్యేకంగా విజిలెన్స్ విచారణ చేయించి వారిని శిక్షిస్తాం.రాబోయే రోజుల్లో ఇలాంటి పనులు చేయాలంటేనే వారు భయపడే విధంగా చర్యలు చేసుకుంటాం.వారు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం రోడ్డు పనులు చేశారా లేదా అన్నది పరిశీలిస్తామని అంతే కాకుండా ఇక్కడ రైతులు పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు కూడా లేదని వీటిని నేషనల్ హైవే అధికారులు దృష్టికి తీసుకు వెళ్తానని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.