PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హిళ‌తో మంత్రి మాట‌ల క‌ల‌క‌లం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఓ మ‌హిళ‌తో ఏపీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస‌రావు మాట్లాడుతున్నట్టు ఉన్న ఆడియో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. ఇది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ‘ పిచ్చిపిచ్చి వేషాలు వేయ‌కుండా ఇంటికి రా. నా మాట విను. అన్ని ర‌కాలుగా బాగుంటుంది. అర‌గంట‌లో పంపించేస్తాను. నా మాట విను. నా కోసం అర‌గంట స‌మ‌యం కేటాయించ‌లేవా ?. ఏం చేస్తున్నావ్ ?. రాక‌పోతే నీ ఇష్టం. వ‌స్తే మంచి భ‌విష్యత్తు ఉంటుంది.’ అంటూ ఓ మ‌హిళ‌తో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడిన‌ట్టు ఆ ఆడియోలో ఉంది. విష‌యం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస‌రావు గురువారం రాత్రి ప‌దిగంట‌ల స‌మ‌యంలో విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల ఓర్వలేక కొంద‌రు త‌న వ్యక్తిత్వ హ‌న‌నానికి పాల్పడుతున్నార‌ని మంత్రి శ్రీనివాస‌రావు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా ప‌నిచేస్తున్న త‌న‌పై ఇప్పటి వ‌ర‌కు ఇలాంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని ఆయ‌న అన్నారు. వైకాపాకు మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ ఓర్వలేక కొంద‌రు కావాల‌నే ఇలాంటి ఆడియోలు సృష్టిస్తున్నార‌ని చెప్పారు. విష‌యం తెలిసిన వెంట‌నే న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. పోలీసులు విచారిస్తున్నార‌ని, నిందితులెవ‌రో త్వ‌ర‌లో తేలుతుంద‌ని అన్నారు.

About Author