PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట నిలుపుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  గతంలో వగరూరు గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఇచ్చిన మాటను మరో సారి నిలుపుకున్నారని వైకాపా మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  ఆదేశాల మేరకు కటిక(మైనార్టీ కాలనీ), వాల్మీకి కాలనీ, ఎస్సీ కాలనీ, బిసీ కాలనీ ల్లో రూ 40 లక్షలతో మంచి నీటి పైప్ లైన్ మరియు రోడ్లు, రూ 3.50 లక్షలతో ఎస్సీ కాలనీ ఆర్వో ప్లాంట్ కు నిర్మాణానికి సి. వి. విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జగనన్న కాలనీల్లోని 96 లబ్దిదారుల  ఇళ్ల కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ చిన్నన్న, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author