దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min read
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదులు స్వీకరణ
తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఖచ్చితత్వమైన భవిష్యత్ ప్రణాళికతో దశలవారీగా ప్రజా సమస్యలకు మోక్షం కల్పిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, పరిష్కారమార్గాలు చూపడం ఇదే ఆదర్శవంతమైన పాలనా విధానం ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏడాదికాలంగా కొనసాగుతూనే ఉంది. ఇదేక్రమంలో బుధవారం సైతం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదేసమయంలో పలువురు చిన్నారులకు నోటుపుస్తకాలను అందించారు. అలాగే ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్ను పంపిణీ చేసి, భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుస్థిరపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీంతో దశలవారీగా అనేక ప్రజా సమస్యలకు సైతం మోక్షం లభించిందన్నారు. అలాగే రానున్న కాలంలో పూర్తిస్థాయిలో సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
