NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే

1 min read

– ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేసిన ఆలయ అర్చకులు.
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మొదటి కార్తీక మాసం సందర్భంగా విజయవాడ లోని కనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారికి ఆలయ అర్చకులు అందచేశారు. ఈ సందర్బంగా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ కార్తీకం మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగిందని చెప్పారు.

About Author