PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెహ్రూ సిబిఎస్సి హై స్కూల్ వార్షికోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని నెహ్రూ సీబీఎస్సీ హైస్కూల్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి నెహ్రూ స్కూల్స్ విద్యాసంస్థల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి శాలువ కప్పి మెమెంటో అందజేశారు. అనంతరం నెహ్రూ విద్యాసంస్థల యాజమాన్యం వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తిలకించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కంప్యూటర్ ఆధునిక యుగంలో ప్రతి విద్యార్థికి సీబీఎస్ఈ చదువు భవిష్యత్తు తరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తు తరం అంతా నేటి విద్యార్థుల దని ఎమ్మెల్యే కాటసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ విద్యాసంస్థల చైర్మన్ కోడూరు హరినాథ్ రెడ్డి, నెహ్రూ విద్యాసంస్థల కరస్పాండెంట్ కోడూరు కమల్ తేజ రెడ్డి, నెహ్రూ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రవితేజ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారిని స్వరూపారాణి, బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author