PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి సేవలో ఎమ్మెల్యే జారా ఆదినారాయణ..

1 min read

శేష వస్త్రంతో కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు సత్కారం..

800 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ

వివిధ సేవల రూపేణ రూ:1,28,056/-లు ఆదాయం

భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : గురవాయిగూడెం తెల్ల మద్ది చెట్టు కింద స్వయం భూములై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ఉదయం గం.5.00లకు ప్రాతః కాలార్చన, తోమాలసేవ, గోపూజ. నిత్య హోమబలిహరణలు నిర్వహించారు. అనంతరం భక్తులను  దర్శనమునకు అనుమతించారు.  స్వామివారు ప్రత్యేక పూల అలంకారంలో దర్శనమిచ్చారు.  మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని,  శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. శ్రీ స్వామి వారిని  తెలంగాణా, అశ్వారావుపేట శాసనసబ్యులు జారా ఆదినారాయణ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం వారిని కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు అందజేశారు. ఈరోజు మద్యాహ్నం  గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,28,056/- లు సమకూరినది.  సుమారు  800 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈరోజు ఆలయము వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం  నిర్వహించినారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ(బాబీ), కర్పూరం రవి,  పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు   పర్యవేక్షణలో  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెల్పిరు.

About Author