PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకో: ఎంపీ అరవింద్

1 min read


పల్లెవెలుగు వెబ్: సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ దర్మపురి అరవింద్. కేసీఆర్ ఎదో ఒక రోజు జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని.. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని అరవింద్ చెప్పారు. కేసీఆర్‌కు మతిమరుపు ఎక్కువైందని..సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని, కేవలం రైస్ మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. హుజూరాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని.. బీజేపీ విజయాన్ని పక్కదారి పట్టించేందుకే నానా తంటాలు పడుతున్నారని అరవింద్ ఎద్దేవా చేశారు.


About Author