PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా మెడ ఎప్పుడు నరుకుతాడో చెప్పాలి: బండి సంజయ్

1 min read


పల్లెవెలుగు వెబ్: సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మందు తాగి బండి నడిపితే తప్పైనప్పుడు… మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పెనంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన మెడలు నరుకుతాననని కేసీఆర్ అన్నారని… ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వరి కొనం అని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, కావాలనే కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. వరి కొంటామని అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని… కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని బండి మండిపడ్డారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ పండుతోందో చూపించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. లీటర్‌పై కేంద్రానికి రూ.27 వస్తే, రాష్ట్రానికి రూ.28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని బండి చెప్పారు.

About Author