NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుట్టగొడుగుల్లో పోషకాలు మెండు..

1 min read

అసోసియేట్ డీన్ డాక్టర్ వి. జయలక్ష్మి.

మహానంది, న్యూస్ నేడు : పుట్టగొడుగుల పెంపకం ఆదాయంతో పాటు ఆరోగ్యం పోషకాలు మెండుగా ఉంటాయని వ్యవసాయ కళాశాల  అసోసియేట్ డీన్ డాక్టర్ వి. జయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మహానంది ఫారంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో, పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళలకు పుట్టగొడుగుల సాగులో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పుట్టగొడుగుల పెంపకానికి 28 నుంచి 35డిగ్రీల ఉష్ణోగ్రత, 85 నుంచి 95శాతం తేమ ఉండే విధంగా చూసుకోవాలన్నారు.పుట్టగొడుగులు పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. పెంపకమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి పాటించాల్సిన అనువైన విధానాలను వివరించారు. పుట్టగొడుగుల పెంపకంలో చేపట్టవలసిన వివిధ ముఖ్యమైన  అంశాల గురించి వివరించారు.  అనంతరం 30 మంది ఎస్సీ మహిళలకు న్యూట్రిషీనల్  కిట్లు , బ్యాగులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఓ ఎస్ ఏ డాక్టర్. విజయ్ భాస్కర్, ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఫరీదా, కో ఇన్వెస్టిగేటర్ డాక్టర్ గురువీరెడ్డి, టీచింగ్ అసోసియేట్ డాక్టర్ టి .గణేష్ అధ్యాపకుల బృందం, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *