PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ ఇమేజ్ వ‌ల్ల మ‌న దేశం న‌ష్ట‌పోతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశానికి మైనారిటీ వ్య‌తిరేకులు అనే ఇమేజ్ రావడం వల్ల‌ న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ అన్నారు. ఇండియన్ ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌లో నష్టం జరుగుతుందని రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇటువంటి ఇమేజ్ వల్ల భారత దేశం నమ్మదగిన భాగస్వామి కాదని విదేశీ ప్రభుత్వాలు భావించే అవకాశం ఉందన్నారు. ఆయన ప్రస్తుతం చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో రాజన్ మాట్లాడుతూ, భారత దేశం పేద దేశమని, ప్రజలందరినీ గౌరవించే ప్రజాస్వామిక దేశమని ఇతరులు భావించినపుడు, మనకు ఎక్కువ సానుభూతి దొరుకుతుందన్నారు. మంచి పని చేయడానికి ప్రయత్నించే దేశం నుంచి నేను ఈ వస్తువును కొంటున్నానని వినియోగదారుడు భావించినపుడు మన మార్కెట్లు వృద్ధి చెందుతాయన్నారు.

                                

About Author