PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`వీర‌సింహారెడ్డి` గా బాల‌య్య ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. బాల‌య్య 107వ సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది. రాయ‌ల‌సీమ నీటి స‌మ‌స్య ప్ర‌ధాన అంశంగా ఈ చిత్రం నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంలో క‌నిపిస్తార‌ని స‌మాచారం. సినిమాకు వీర‌సింహారెడ్డి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

                                    

About Author