PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధ‌మ‌న్న నేతాజీ కుమార్తె !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ తెలిపారు. జపాన్ రాజధాని టోక్యో రెంకోజీ టెంపుల్‌లో ఉన్న నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆమె కోరుతున్నారు. రెంకోజీ టెంపుల్‌లో ఉన్న అస్థికలు నేతాజీవేనా కాదా అనే విషయంలో డీఎన్‌ఏ టెస్ట్ చేయాలనుకుంటే తాను అందుకు సిద్ధమని అనిత ప్రకటించారు. నేతాజీ అస్థికలు ఉండాల్సింది భారత్‌లోనే అని ఆమె చెబుతున్నారు. నేతాజీ జీవితాన్నంతటినీ భారత స్వాతంత్ర్యం కోసమే అర్పించారని ఆమె గుర్తు చేశారు. భారతీయులు ఇప్పటికైనా ఆయన అస్థికలను భారత్‌కు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నించాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.

                                                              

About Author