PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ఠాధిప‌త్యం పై ఎలాంటి వీలునామా అంద‌లేదు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బ్రహ్మం గారి మ‌ఠాధిపతులుగా 11 మంది ప‌నిచేశార‌ని, మ‌ఠాధిప‌త్యానికి సంబంధించి ఎలాంటి వీలునామా త‌మ‌కు అంద‌లేద‌ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ వెల్లడించారు. మ‌ఠాధిప‌త్యానికి సంబంధించి అధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వహించారు. మ‌ఠాధిప‌త్యానికి సంబంధించి వీలునామా 90 రోజుల్లో అందాల‌ని , లేనిప‌క్షంలో ధార్మిక‌ప‌రిష‌త్ నిర్ణయం అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపారు. మ‌ఠం నిర్వహ‌ణ‌కు తాత్కాలిక అధికారిని నియ‌మించామని, మ‌ఠం ఆచారాలు, సంప్రదాయాల‌ను త్వర‌తిగ‌తిన సేక‌రిస్తామ‌ని తెలిపారు. మ‌ఠాధిప‌తిని సంప్రదాయ‌బ‌ద్దంగా ఎన్నుకుంటామ‌ని ప్రక‌టించారు.

About Author