NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంచార చికిత్స కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్  తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉదయం 11 గంటలకు కల్లూరు మండలం ఉల్లిందకొండ     ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని  ఓబుళాపురం తాండలో గ్రామంలో జరుగుచున్న   సంచార చికిత్స కార్యక్రమన్ని    నోడల్ ఆఫీసర్  డాక్టర్. రఘు   తనిఖీ సిహెశారు.అనంతరం  సికిల్ సెల్ వ్యాధి అవగాహన కార్యక్రమములో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జన్యుపరమైన సమస్యలతో వంశపారంపర్యంగా సంభవించే రక్త సమస్య సికిల్ సెల్  ఈ వ్యాధి కారణంగా రక్తహీనత, కామెర్లు,కీళ్లనొప్పులు,కాలేయ సమస్యలు, మూత్ర పిండాలు,పిత్తషయంలో రాళ్ళు,పక్షవాతం,ఛాతీ సమస్య,ఆయాసం,.కడుపు నొప్పి లాంటి లక్షణాలు   ఎక్కువగా కనిపిస్తాయి,కొన్ని సందర్భాల్లో రక్తహీనత  సమస్య పెరిగి చివరికి ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతాయి,క్యారియర్ల ద్వారా వేరొకరికి వ్యాధి సంక్రమిస్తుందని క్యారియర్లు వివాహం చేసుకున్నా మహిళలకు గర్భస్రావం అవుతుంది,త్వరగా పిల్లలు పుట్టకపోవచ్చును, ఒకవేళ పిల్లలు పుట్టిన వారికి ఈ వ్యాధి సంక్రమించేందుకు 25 శాతం అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. అనంతరం ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్  ఫ్లోరోసిస్  వ్యాధి లక్షణాల గురించి వివరించినారు.ఈ కార్యక్రమములో డాక్టర్.నిస్సిగ్రెస్ , ,ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్,సామాజిక ఆరోగ్య అధికారి మాబున్ని,ఆరోగ్య కార్యకర్త జాహ్నవి,ఆషా కార్యకర్తలు లక్ష్మీదేవి మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *