సంచార చికిత్స కార్యక్రమం నోడల్ అధికారి తనిఖీ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని వెంకన్నబాయి అంబెడ్కర్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘుగారు తనిఖీ చేశారు.. అనంతరం గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీకి మాతృత్వం దేవుడిచ్చిన వరం,బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి పునర్జన్మగానే చెప్పవచ్చు, సాధారణ ప్రసవం తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది,ప్రస్తుతం ఆధునికీ పోకడలతో కొంత మంధి మూడనమ్మకాలు ,జాతకాల పేరిట ముహూర్తం చూసి ముందస్తు ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు, తల్లి,బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.తల్లి కడుపులో నవమాసలు ఉండి శరీర ఎదుగుదలతో భూప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన శిశువులు అరకొర ఆరోగ్యంతోనే బయటకు వస్తున్నారు, అంతిమంగా అటు తల్లికి,శిశువుకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలొ డాక్టర్. నాగరాజు , సామాజిక ఆరోగ్య అధికారి సుమధుర, ఆరోగ్య కార్యకర్త భీమేశ్వరి, ఆశా మరియు ప్రాజెక్షనీస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.