PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాంసాహారం గొడ‌వ‌.. ఆరుగురి విద్యార్థుల‌కు గాయాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నాన్ వెజ్ ఫుడ్ విషయంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని కావేరీ హాస్టల్‌లో ఆదివారం రామనవమి రోజున మెస్‌లో మాంసాహారం అందించినందుకు రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. హింసలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఇరువర్గాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని రెండు వర్గాల విద్యార్థులు పేర్కొన్నారు. హింసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అఖ్తరిస్తా అన్సారీ అనే విద్యార్థి తల నుంచి రక్తస్రావం అవుతున్నట్లు వీడియోలో కనిపించింది.

                                               

About Author