NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ముమ్మడి” సారధ్యంలో ఎన్టీఆర్ జయంతి “మహానాడు”సక్సెస్

1 min read

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు న్యూస్ నేడే: బండి ఆత్మకూరు మండలానికి నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉమ్మడి కృష్ణారెడ్డి సారథ్యంలో నందమూరి తారక రామారావు 16 వ జయంతి ఉత్సవాలతో పాటు మహానాడు సభలు విజయవంతమయ్యాయని కార్యకర్తలు సంబరపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గతంలో రెండు పర్యాయాలు పార్టీ కన్వీనర్లుగా వ్యవహరించిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలన్న పార్టీ ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గం లోని అన్ని మండలాలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు బండిఆత్మకూరు మండలానికి సంత జూటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి కృష్ణారెడ్డిని  పార్టీ కన్వీనర్ గా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆరంభమైన నాటినుండి కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. కృష్ణారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో  ఎలా పార్టీని ముందుకు నడిపిస్తాడో అని అందరూ ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితులలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి  ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ముమ్మడి కృష్ణారెడ్డి గత నాయకుల కంటే భిన్నంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు బండి ఆత్మకూరు రావాలని ప్రతి గ్రామంలోని కార్యకర్తలను  క్రింది స్థాయి నుండి పై స్థాయి కార్యకర్తలు అందరూ ఎన్టీఆర్ జయంతికి తరలిరావాలని ఫోన్ల ద్వారా పిలుపునిచ్చారు. ఉమ్మడి ఫోన్ పిలుపు అందుకున్న వెంటనే ప్రతి గ్రామంలోని కార్యకర్తలు అందరూ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి తరలివచ్చారు. పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలను నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఉమ్మడి కృష్ణారెడ్డిని పార్టీ కార్యకర్తలందరూ అభినందించారు. దీనికి తోడు 27,28, 29 తేదీలలో మహానాడు ఉత్సవాలను కడప గడపలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గాను పార్టీ కార్యకర్తలు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. బండి ఆత్మకూరు లోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి మహానాడుకు కార్యకర్తలు ముమ్మడి కృష్ణారెడ్డి కృషి చేశారు. మండలంలో దాదాపు 15 ఆర్టీసీ బస్సులతో పాటు కార్లలో సైతం కార్యకర్తలు ఆఖరి రోజున మహాసభకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సారధ్యంలో ఇకనుండి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముమ్మడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *