PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా ఎన్వీ ర‌మ‌ణ ప్రమాణం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న చేత రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. చీఫ్ జ‌స్టిస్ గా ఇదివ‌రకు ప‌నిచేసిన ఎస్.ఎ. బాబ్డే ప‌దవీ కాలం నిన్నటికి పూర్తయింది. ఎన్వీర‌మ‌ణ 2022 ఆగ‌స్టు 26 వ‌రకు ప‌ద‌విలో కొన‌సాగుతారు. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, ప్రధాని మోదీ, మంత్రులు, ఎన్వీర‌మ‌ణ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార‌ణానికి హాజ‌రయ్యారు. ఎన్వీర‌మ‌ణ స్వస్థలం కృష్ణా జిల్లా పొన్నవ‌రం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. గ‌తంలో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సీజేఐగా ప‌నిచేశారు.

About Author