PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

39 మంది కంటి రోగులకు ఆపరేషన్లు

1 min read

పల్లెవెలుగు వెబ్​: అన్నమయ్య జిల్లా రాయచోటిసమీపంలోని  చెన్నముక్కపల్లి పంచాయతీ లో ఉన్న లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 39 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట,రైల్వే కోడూరు,పీలేరు,కలకడ,గుర్రంకొండ,కె.వి.పల్లి,యర్రావారిపాలెం,కలికిరి తదితర ప్రాంతాల నుండి వచ్చిన 90 మంది కంటి రోగులకు  కంటి వైద్యులుపరీక్షలు నిర్వహించి అందులో అర్హులైన 39 మంది కంటి రోగులకు ఆపరేషన్ లు చేశారు.అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 50 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉచితంగా అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి చైర్మన్ వై.వి.ఆర్.స్వరూప గుప్త,మార్కెట్ యార్డ్ చైర్మన్ లయన్ చెన్నూరు అన్వర్ భాష,ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,కంటి వైద్యులు సురేష్ బాబు, మహాలక్ష్మి, భార్గవి, శశిబిందు, ఆప్తమాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author