PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24 మంది కంటి రోగులకు ఆపరేషన్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 24 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట,రైల్వేకోడూరు,కలికిరి,కలకడ,గుర్రంకొండ,పెద్దమండెం,యర్రా వారిపాలెం,కేవీ పల్లి,కదిరి,ఎన్.పి.కుంట తదితర ప్రాంతాల నుండి వచ్చిన 50 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అర్హులైన 24 మంది కంటి రోగులకు ఆపరేషన్లు చేశారు.అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 30 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప్ గుప్తా,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష, ఏపీఐఐసి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,కంటి వైద్యులు సురేష్ బాబు,భార్గవి,ఆప్త్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author