PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్సిజ‌న్ అందక 24 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన మ‌ర‌ణాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రుల్లో మృత్యుఘంటిక‌లు మోగుతున్నాయి. ఆక్సిజ‌న్ కొర‌త దేశంలో ఆస్పత్రుల‌ను వేధిస్తోంది. కర్నాటకలోని చామరాజనగర్ ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ అంద‌క 24 మంది మృతి చెందారు. ఈ ఘటన మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వెంటిలేట‌ర్ మీద ఉన్న వారికి ఆక్సిజ‌న్ స‌కాలంలో అంద‌క‌పోతే వారి ప‌రిస్థితి కూడ ప్రమాద‌క‌రంగా మారుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ అవ‌స‌రం పెరిగిపోతోంది. దీంతో ఆస్ప‌త్రుల్లో తీవ్రమైన ఆక్సిజ‌న్ కొర‌త ఏర్పడింది.

About Author