PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన పాక్ ప్ర‌ధాని !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాక్ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇండియాతో శాంతియుత సహకార సంబంధాలను కోరుతున్నామని పాక్‌ నూతన ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. తనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. జమ్ము, కశ్మీర్‌పై వివాదం పరిష్కారమైతేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని పాత పాటే పాడారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ ఎన్నో నష్టాలు చవిచూస్తోందన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కశ్మీర్‌ రక్తమోడుతోంటూ షరీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

                                     

About Author