PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో ప‌వ‌న్ యాత్ర‌.. కౌలు రైతుకు ఆర్థిక సాయం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర కొన‌సాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు దూదేకుల పండ్లాపురం చిన్న హుస్సేనీ కుటుంబానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేశారు. వ్యవసాయంలో అప్పులపాలు కావడంతో హుస్సేనీ ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాత్రలో భాగంగా నంద్యాల జంక్షన్ వద్ద శ్రీ హుస్సేనీ భార్య పండ్లాపురం షామీర్ బీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు ఎకరాల్లో మిర్చి, ఐదు ఎకరాల్లో జొన్న సాగు చేయగా పంట నష్టం, గిట్టుబాటు దక్కక నష్టం వచ్చినట్టు ఆమె పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఇంటి పెద్ద చనిపోయి దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కనీసం పలుకరింపు కరువయ్యిందని వాపోయారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపంలో శామిర్ బీకి అందచేశారు.

                        

About Author