NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం

1 min read

పింఛన్ల పంపిణీలో మంత్రి టీజీ భరత్

ఇబ్బందులు అధిగమించి మాట ప్రకారం పింఛన్లు

కర్నూలు, న్యూస్​ నేడు: శనివారం దేశంలోకెల్లా అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం 48వ వార్డు అమీర్ హైదర్ నగర్‌లో మంత్రి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబుతో కలిసి పలువురు లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. పింఛన్ల నగదు సక్రమంగా జరుగుతుందా? లేదా? అని లబ్దిదారులను ఆరా తీశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు.బి.నాగమ్మక, సందేపోగు సుకుమార్‌, వడ్డే లక్ష్మీదేవి‌, యూ.లక్ష్మన్నలకు వృద్ధాప్య, కే.డ్యాని, వి.రామకృష్ణలకు దివ్యాంగుల పించన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదాయం సమకూర్చుకోలేని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా 1వ తేదీ, ఆరోజు సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందే పింఛన్ల నగదు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 11 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా పక్కా ప్రణాళిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దేశంలో పింఛన్ల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని, పేదల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. పేదలకు రోజువారీ ఖర్చులకు పింఛన్ల నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అమీర్ హైదర్ నగర్ నందు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, తొలి దశలో రూ.1.54 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందని, ఒక్కొక్కటిగా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చుస్తారని పేర్కొన్నారు.కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్ల పంపిణీ ఒక్క రాష్ట్రంలోనే పకడ్బందీగా జరుగుతుందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల నగదు అందిస్తోందన్నారు. నగరంలో ప్రతి నెలా సుమారు 36 వేల మందికి రూ.16 కోట్ల రూపాయలు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఆమీర్ హైదర్ కాలనీ రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, రూ.40 లక్షలతో డబ్లూబియం రహదారి నిర్మాణానికి  సంబంధించిన ప్రక్రియ టెండర్ దశలో ఉందని, రూ.1.16 కోట్ల సిసి రహదారి నిర్మాణానికి సైతం చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *