PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వడ్డీ మాఫీ అవకాశానికి నగర ప్రజలు ఉపయోగించుకోవాలి : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు వడ్డి మినహాయింపు తో ఆస్తి పన్ను కట్టుకొనుటకు చివరి రోజు కావడం తో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను వసూలు ప్రక్రియ, కౌంటర్ల నిర్వాహన గురించి సంబంధిత అధికారులతో చర్చించగ, ఈరోజు రాత్రి 12 గంటల వరకు కౌంటర్లు పని చేస్తాయని అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది.ఎమ్మెల్యే గారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించారు. కౌంటర్లలో ఉన్న అధికారుల పనితీరును పరిశీలించారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆస్తి పన్ను కట్టాల్సిన మార్చి 31 చివరి రోజు కావడంతో మున్సిపల్ ఆఫీసుకు ప్రజలు పోటెత్తారు.ఆస్తిపన్ను పై వడ్డీ మాఫీ అవకాశానికి నగర ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు .

About Author