PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. టి.జి భరత్

1 min read

– రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు మేలు జరుగుతుందని కర్నూలు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు టిడిపి ఇంచార్జి టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో టిడిపి నేతలు ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను నేరుగా కలిసి మాట్లాడారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించాలని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే అధికార పార్టీలో చలనం మొదలై ఇప్పుడైనా డెవలప్మెంట్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దేశంలో క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఓర్వకల్లులో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ కు లక్ష కోట్ల పెట్టుబడులైనా ఇవ్వాలని కోరారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టభద్రులంతా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సోమిశెట్టి నవీన్, గున్నామార్క్, మన్సూర్ ఆలీఖాన్, శ్రీధర్, రవి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం 4 , 5 , 6 , 8 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి టిడిపికి ఓటు వేయాలని కోరారు.

About Author