NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం…                 

1 min read

పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ. శ్యామ్ కుమార్            

పత్తికొండ, న్యూస్ ​నేడు:  నిరంతరం యోగా చేయడంతోనే  మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పత్తికొండ పట్టణంలోని తేరు బజారు నందు మెగా యోగ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించగలరని  ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్డిఓ భరత్ నాయక్, పత్తికొండ పట్టణ సిఐ జయన్న ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. మన పూర్వీకుల నుండి వచ్చిన గొప్ప సంపద యోగ అని వారు అన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా యోగ ఆంధ్ర కార్యక్రమం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డును నమోదు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పత్తికొండలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఎదురవుతున్న సవాళ్లు, జీవన విధానం నేపథ్యంలో యోగ సాధన కీలకంగా మారిందని అన్నారు . మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించడానికి యోగ సాధన ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఒత్తిడి, ఆందోళనల నుండీ ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరు యోగాను చేయాలని కోరారు. యోగ సాధన వల్ల మానసికంగా భౌతికంగా దృఢత్వం కల్గి కలిగి ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు పట్టణ ప్రజలువిద్యార్థులుపాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *