PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసులే జ‌న‌సేన ఫ్లెక్సీ తొల‌గిస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ పోలీసుల పై మండిప‌డ్డారు. పోలీసులే కాపలా కాస్తూ జనసేన బ్యానర్లు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్లెక్సీల తొల‌గింపు విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వారధి వద్దకు చేరుకున్నారు. దీనిపై పోలీసులు, నాదెండ్ల మనోహర్ మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలు వారధిపై భారీగా పోల్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేని కారణంగానే బ్యానర్లు తొలగిస్తున్నామని పోలీసులు తెలిపారు. అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                              

About Author